యాప్నగరం

Tamil Nadu: ప్రశాంత్ కిషోర్ ఆఫీస్‌లో మెరిసిన స్టాలిన్

ప్రశాంత్ కిషోర్ టీమ్ ఐప్యాక్ ఆఫీస్‌ని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సందర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన ఆఫీస్‌కి స్టాలిన్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Samayam Telugu 9 Apr 2021, 12:30 am
తమిళనాట ఎన్నికలు ముగిసిన అనంతరం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అనూహ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆఫీస్‌లో సందడి చేశారు. ఆయన తన అల్లుడు శబరీషన్‌తో కలసి ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ ఆఫీస్ తళుక్కుమన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన ప్రశాంత్ కిషోర్ టీమ్ ఆఫీస్‌కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఐప్యాక్ ఆఫీస్‌కి వెళ్లిన ఆయన అక్కడ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డీఎంకేకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
Samayam Telugu ప్రశాంత్ కిషోర్ ఆఫీస్‌లో స్టాలిన్
stalin


ఈ తరుణంలో ఎంకే స్టాలిన్ తన అల్లుడితో కలసి ప్రశాంత్ కిషోర్ టీమ్ ఆఫీస్‌కి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాబోయే సీఎం స్టాలిన్ అనే ఉత్సాహం అక్కడ కనిపించింది. ఐప్యాక్ సిబ్బందితో స్టాలిన్ సెల్ఫీలు తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌‌‌తో డీల్‌లో ప్రధాన పాత్ర పోషించిన స్టాలిన్ అల్లుడు శబరీషన్‌తో కలసి ఆయన ఐప్యాక్ ఆఫీస్‌లో సందడి చేశారు. గతంలో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌తో సందడి చేసిన విషయం తెలిసిందే. సెల్ఫీలు దిగి అందరినీ ఉత్సాహపరిచారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.