యాప్నగరం

Tamil Nadu: కంపెనీ సీఈవోపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. తిట్టి.. బెదిరించి...

తమిళనాడులో (Tamil Nadu) రాజకీయ ప్రతినిధి.. జనం ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే తన సహనాన్ని కోల్పోయారు. కంపెనీ సీఈవోపై అసభ్య పదజాలంతో మండిపడ్డారు. ఒకరికి మద్దతుగా వచ్చిన ఆయన.. కంపెనీ యజమానిని బెదిరించారు. ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీనిపై బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 22 Sep 2022, 7:35 pm
తమిళనాడులో (Tamil Nadu) ఓ ఎమ్మెల్యే కంపెనీ సీఈవోపై రెచ్చిపోయారు. ఒక కంపెనీ యజమాని అని కూడా చూడకుండా.. అసభ్య పదజాలంతో అతనిని తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై కేసు నమోదైంది. చెన్నైలో ఈ సంఘటన జరిగింది.
Samayam Telugu DMK MLA SR Raja threatens CEO


తాంబరంలో మరైమలై నగర్‌లో ఉన్న డేజంగ్ మోపార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గతంలో ఆర్‌కే శర్మ అనే వ్యక్తిపై ఆ కంపెనీ యాజమాన్యం చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ఆయనకు మద్దతుగా స్థానిక డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రాజా ఆ కంపెనీ ఆఫీసుకు వెళ్లారు. వెళ్లి వెళ్లగానే ఆ కంపెనీ సీఈవో కృష్ణమూర్తిపై విరుచుకుపడ్డారు. బూతులు తిట్టడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారు.


అయితే ఎమ్మెల్యే బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆ కంపెనీ సీఈవో కృష్ణమూర్తి కూడా ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై తాంబరం పోలీసులు స్పందించారు. అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రాజాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై కూడా స్పందించారు. ఎమ్మెల్యే ఇలా బెదిరింపులకు పాల్పడడంపై మండిపడ్డారు. డీఎంకే పాలనలో నిబంధనలు, శాంతి భద్రతలను స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ఎమ్మెల్యే సీఈవోపై బెదిరింపులకు పాల్పడిన వీడియోను కూడా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.