యాప్నగరం

గవర్నర్‌కే ఫైనల్ అల్టీమేటం ఇచ్చిన డీఎంకే

తమిళనాడులో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వానికి తగిన మద్దతు లేదని...

TNN 10 Sep 2017, 7:48 pm
తమిళనాడులో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వానికి తగిన మద్దతు లేదని, 119 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా వున్నారని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ అగ్రనేత స్టాలిన్ ఆరోపించారు. ఇకనైనా తమిళనాడు అసెంబ్లీని సమావేశపర్చి బలపరీక్ష చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ డీఎంకే నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు అంతా కలసి వెళ్లి తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుని కలిసి 2 పేజీల వినతి పత్రం అందజేశారు.
Samayam Telugu dmk working president mk stalin aiadmk cm edappadi k palaniswami tamil nadu governor c vidyasagar rao delegation ultimatum to governor tamilnadu pannerselvam mk stalin
గవర్నర్‌కే ఫైనల్ అల్టీమేటం ఇచ్చిన డీఎంకే


గవర్నర్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన స్టాలిన్... తమ విజ్ఞప్తిపై స్పందించిన గవర్నర్ రాజ్యాంగం ప్రకారమే తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారని అన్నారు. వారం రోజులపాటు నిరీక్షిస్తామని, అప్పటికీ గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే కోర్టుకి వెళ్లడానికైనా కానీ లేదా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడానికైనా తాము సిద్ధమేనని అల్టీమేటం జారీచేశారు స్టాలిన్.

డీఎంకే, కాంగ్రెస్, ఐయుఎంల్ పార్టీలకి చెందిన 98 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో వున్నారు. ఇక అధికార పార్టీకే చెందిన 21 మంది ఎమ్మెల్యేలకి పళనిస్వామిపై తమకి విశ్వాసం లేదని ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య మొత్తం 119కి చేరింది. అటువంటప్పుడు ఆయన ప్రభుత్వానికి సరైన మద్దతు వున్నట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు స్టాలిన్. ఇవే గణాంకాలని గవర్నర్‌కి సైతం వివరించినట్టు స్టాలిన్ మీడియాకు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.