యాప్నగరం

భారత్, అమెరికాల్లో ఆ డీఎన్ఏ మాయమవుతోంది.. రాహుల్ గాంధీ

Coronavirus India: కరోనా నుంచి ప్రపంచం బయటికి వచ్చాక అంతర్జాతీయ సమాజం బాధ్యతగా తీసుకొని ప్రతి అంశంపై కలిసి పనిచేయగలుగుతుందా అనేది అతి పెద్ద సవాలని తాను అనుకుంటున్నట్లుగా రాహుల్ అన్నారు.

Samayam Telugu 12 Jun 2020, 4:06 pm
భారత్, అమెరికా దేశాలకు ఇప్పటిదాకా సహనం ఎక్కువ ఉన్న దేశాలుగా పేరుండేదని, ఇప్పుడు ఆ డీఎన్ఏ ఇరు దేశాల్లోనూ మాయమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన మాజీ దౌత్యవేత్త నికోలస్‌ బర్న్స్‌తో జరిపిన సంభాషణలో భాగంగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘మా దేశం ఎక్కువ సహనం గలది. మేం ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్‌గా ఉంటాం. దీని తాలూకు డీఎన్ఏ ఇప్పుడు మాయమైపోతోంది. నేను ఎప్పుడూ చూసే సహనపు స్థాయి ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు బాధపడుతున్నాను. అమెరికాలోనూ, ఇండియాలోనూ ఈ సహనం కనిపించడం లేదు.’’ అని రాహుల్ పేర్కొన్నారు.
Samayam Telugu రాహుల్ గాంధీ
rahul gandhi


అంతేకాక, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ‘‘దేశంలో కఠినమైన లాక్‌ డౌన్‌ను విధించారు. ఇప్పుడు దీని ఫలితాలను అంతా చూస్తున్నారు. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ నాయకత్వం చాలా విఘాతం కలిగిస్తోంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ డీఎన్‌ఏ ఒకే రకంగా ఉంది. కొవిడ్ 19 కారణంగా ఇప్పుడు మేం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం గతంలో కంటే ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవడాన్ని చూశాను’’ అని రాహుల్ అన్నారు.

కరోనా నుంచి ప్రపంచం బయటికి వచ్చాక అంతర్జాతీయ సమాజం బాధ్యతగా తీసుకొని ప్రతి అంశంపై కలిసి పనిచేయగలుగుతుందా అనేది అతి పెద్ద సవాలని తాను అనుకుంటున్నట్లుగా రాహుల్ అన్నారు. చైనా గురించి మాట్లాడుతూ.. ఆ దేశం ప్రగతి సాధిస్తోందని.. అందులో అనుమానమేం లేదని అన్నారు. భారత్, అమెరికా దేశాల్లా కాకుండా అక్కడ ప్రజలను భయంతో అదుపుచేస్తారని వ్యాఖ్యానించారు.’’ అని రాహుల్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.