యాప్నగరం

కరుణ ముత్తాతది ఒంగోలే.. పెళ్లూరు సంస్థానంలో కొలువు!

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తని, ఆయన తెలుగువారేనన్న విషయం తెలిసిందే. ఆయనకు ముందు రెండు తరాల కిందటివారు ఒంగోలులోనే ఉన్నారు.

Samayam Telugu 9 Aug 2018, 10:10 am
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తని, ఆయన తెలుగువారేనన్న విషయం తెలిసిందే. ఆయనకు ముందు రెండు తరాల కిందటివారు ఒంగోలులోనే ఉన్నారు. ఒంగోలుకు ఆనుకుని ఉన్న చెర్వుకొమ్ముపాలెంలోనే కరుణానిధి పూర్వీకులు నివాసం ఉండేవారు. పెళ్లూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేసినట్టు ప్రముఖ రచయిత కొంపల్లి బాలకృష్ణకు స్వయంగా కరుణానిధి చెప్పారు. డిటెక్టిల్‌ నవలా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కొంపల్లి కూడా నాలుగేళ్ల కిందట మరణించారు. అయితే ఈ విషయాన్ని బాలకృష్ణ తన సతీమణి అరుణకు వివరించారు. ఈ విషయం గురించి ఓ ప్రముఖ మీడియాకు ఆమె తెలియజేశారు. స్వతహాగా రచయిత అయిన కరుణానిధికి నవలలు, రచయితలన్నా ఎనలేని గౌరవం, అభిమానం. అందులోనూ డిటెక్టివ్‌ నవలలను ఆయన విపరీతంగా ఇష్టపడేవారు. ఇక 1960 వ దశకం ఆరంభంలో ఏలూరులో డిటెక్టివ్‌ నవలా రచయితల సమావేశం జరిగింది.
Samayam Telugu కరుణానిధి


ఈ సభకు కరుణానిధి కూడా అతిథిగా హాజరయ్యారు. ఒంగోలుకు చెందిన కొంపల్లి బాలకృష్ణ డిటెక్టిల్‌ నవలా రచయిత. పదహారేళ్ల వయసులోనే నవలలు రాసి గుర్తింపు తెచ్చుకున్న కొంపల్లికి ఈ సభకు ఆహ్వానం అందడంతో వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనను తాను పరిచయం చేసుకుని, ఒంగోలు నుంచి వచ్చానని కరుణకు చెప్పారు. దీంతో ఆప్యాయంగా మాట్లాడిన కళైంజ్ఞర్.. ‘ఒంగోలా... అయితే నువ్వు మా వాడివే. ఒంగోలు ఎలా ఉంది? మాది కూడా ఆ ఊరే. మా ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పని చేశారు. పరిస్థితులు తారుమారు కావడంతో మద్రాసుకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డాం’ అని తెలియజేశారు. అనంతరం బాలకృష్ణ ఆ విషయం అందరికీ తెలిపారు.

ఒంగోలులోని మంగమ్మ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యుడిగానూ పని చేసిన కొంపల్లి తరచూ తన సన్నిహితుల వద్ద కరుణానిధి చెప్పిన మాటలను చెప్పేవారు. నాలుగేళ్ల కిందట బాలకృష్ణ మరణించారు. తాజాగా కరుణానిధి మరణంతో తన సన్నిహితుల వద్ద బాలకృష్ణ ఆయన గురించి చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. కొంపల్లి భార్య అరుణ మాట్లాడుతూ..‘ఏలూరు సభ సందర్భంగా బాలకృష్ణతో తమ పూర్వీకులది ఒంగోలు సమీపంలోని చెర్వుకొమ్ముపాలెమని, పెళ్లూరు ఆస్థానంలో పనిచేసేవారని కరుణానిధి’ చెప్పారు. ఈ విషయాలను తరచూ ఆయన మాతో పంచుకునేవారని బాలకృష్ణ భార్య తేళ్ల అరుణ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.