యాప్నగరం

వైద్యానికి ముందే ఫీజు వెల్లడించాలి: ప్రభుత్వం

డాక్టర్లు తమ ఫీజు వివరాలను ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని, రోగి చికిత్సకయ్యే ఖర్చును ముందుగానే చెప్పాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

TNN 7 Feb 2017, 7:40 pm
డాక్టర్లు తమ ఫీజు వివరాలను ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని, రోగి చికిత్సకయ్యే ఖర్చును ముందుగానే చెప్పాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం వైద్యం చేసిన తరవాత ఫీజు వివరాలు చెప్పడం సమంజసం కాదని వెల్లడించింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వైద్య నీతి నియమావళి, 2002 ప్రకారం ఒక డాక్టరు తన సొంత ఆసుపత్రిలో కానీ, లేదా ప్రత్యేకంగా వెళ్లే ఆసుపత్రిలో కానీ బోర్డుపై ఫీజు వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించింది.
Samayam Telugu doctors should announce fee before treatment not after govt
వైద్యానికి ముందే ఫీజు వెల్లడించాలి: ప్రభుత్వం


అలాగే ఆపరేషన్ లేదా చికిత్సకు అయ్యే ఖర్చును ముందుగానే రోగికి లేదా రోగి కుటుంబ సభ్యులకు చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే మంగళవారం రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. నల్ల ధనానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా డాక్టర్లు కూడా తమ ఫీజును నగదు రహిత పద్ధతిలో తీసుకోవడానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తుందని ఆయన వెల్లడించారు. నరేంద్ర మోదీ డీమానిటైజేషన్ నిర్ణయం తరవాత దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న వైద్య రంగాన్ని నగదు రహితంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.