యాప్నగరం

గాంధీ విగ్రహ ఘటనపై స్పందించిన ట్రంప్

అమెరికాలో జరిగిన ఇటీవల ఆందోళనల్లో పలువురు నిరననకారులు గాంధీ విగ్రహంపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

Samayam Telugu 9 Jun 2020, 1:12 pm
అమెరికా జాత్యహంకార వ్యతిరేక నిరసనలతో అట్టుడికింది. నల్లాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను పోలీసులు హత్య చేయడంతో... ఆందోళనలు హింసాత్మాకంగా మారాయి. నిరసనకారులు చేసిన దాడుల్లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. వైట్‌ హౌస్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ట్రంప్


వాషింగ్టన్‌లోని భారత రాయబారి కార్యాలయం వెలుపల మహాత్మాగాంధీ విగ్రహాన్ని జూన్‌ 2న అర్ధరాత్రి దుండగులు అపవిత్రం చేసిన విషయం తెలిసిందే. ఆఫ్రో అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌.. పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోవడంపై వ్యక్తమైన ఆందోళనల్లో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. విగ్రహంపై రాతలు రాసి, నల్లరంగు పులిమారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం.. అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేసింది. గాంధీ విగ్రహంపై దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ఫిబ్రవరిలో భారత పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఆయన సతీమణి మెలనియాతో కలిసి సబర్మతీలోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు గాంధీ ఉపయోగించిన రాట్నాన్ని పరిశీలించి.. దాని పనితీరును ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ తన అభిప్రాయాన్ని అక్కడ ఉన్న పుస్తకంలో రాశారు.ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు వైట్‌ హౌస్ గోడలపై కూడా కనిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.