యాప్నగరం

‘ఐ బెగ్ టు’ కాదు.. ‘ఐ రైజ్ టు’ అనండి: వెంకయ్య

రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ప్రత్యేకతను చూపించారు. ఇప్పటి వరకు సభ్యులు సభలో ప్రత్యేక అంశాన్ని లేవనెత్తినప్పుడు, పత్రాలను ప్రవేశపెట్టినప్పుడు ‘ఐ బెగ్‌ టు’ అని పలికేవారు. ఇకపై సభలో ఆ పదాన్ని వాడొద్దని వెంకయ్య నాయుడు సూచించారు.

TNN 15 Dec 2017, 9:30 pm
రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ప్రత్యేకతను చూపించారు. ఇప్పటి వరకు సభ్యులు సభలో ప్రత్యేక అంశాన్ని లేవనెత్తినప్పుడు, పత్రాలను ప్రవేశపెట్టినప్పుడు ‘ఐ బెగ్‌ టు’ అని పలికేవారు. ఇకపై సభలో ఆ పదాన్ని వాడొద్దని వెంకయ్య సూచించారు. అది బ్రిటిష్ కాలంనాటి సంప్రదాయమని, వలసవాదానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని, నియంతృత్వానికి చిహ్నమైన 'నేను వేడుకుంటున్నాను' మాటను మర్చిపోవాలని వెంకయ్య సూచించారు.
Samayam Telugu dont say beg we are a free nation venkaiah naidu to rajya sabha members
‘ఐ బెగ్ టు’ కాదు.. ‘ఐ రైజ్ టు’ అనండి: వెంకయ్య


‘ఐ బెగ్‌ టు’ పదం స్థానంలో 'నేను లేవనెత్తుతున్నాను' అనే మాటను ఉపయోగించాలని చెప్పారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభ రోజైన శుక్రవారం (డిసెంబర్ 15) రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఈ సూచన చేశారు. అయితే.. ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని సభ్యులకు చెప్పారు.

అంతేకాకుండా మృతిచెందిన సభ్యులకు సంతాప ప్రకటన సందర్భంలోనూ సభలో వెంకయ్య నిల్చుంటారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా సంతాప ప్రకటన సమయంలో నిల్చుంటారు. అంతకుముందు రాజ్యసభ ఛైర్మన్లుగా వ్యవహరించిన హమీద్‌ అన్సారీ, భైరాన్‌ సింగ్‌ షెకావత్‌ కూర్చునే ఉండేవారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.