యాప్నగరం

వీడియో: కేరళ వరదల్లో జనం.. మానవహారం కాపాడిందా?

వరద ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాల కోసం పోరాడుతున్న కొంత మంది కేరళవాసులకు సంబంధించిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న వయనాడ్ జిల్లాలోని కనియంబెట్ట ప్రాంతంలో కొంత మంది భారీ వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు.

Samayam Telugu 11 Aug 2018, 9:46 pm
దక్షిణాది రాష్ట్రం కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. వరద ముంచెత్తడంతో 54 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగి పడి వందలాది ఇళ్లు కూలిపోయాయి. రాష్ట్రంలోని సగం భూభాగం జలదిగ్బంధంలోనే ఉంది. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకూ 29 మంది మరణించారు. ఎటూ చూసిన నీరే కనిపిస్తుండటంతో కేరళవాసులు కన్నీరే మిగిలింది. బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకొని ఊహించని ప్రమాదాల బారిన పడుతున్నారు.
Samayam Telugu wayanad


వరద ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాల కోసం పోరాడుతున్న కొంత మంది కేరళవాసులకు సంబంధించిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న వయనాడ్ జిల్లాలోని కనియంబెట్ట ప్రాంతంలో కొంత మంది భారీ వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. మరికొంత మంది అప్పటికప్పుడు మానవహారంగా ఏర్పడి వారికి కాపాడే ప్రయత్నం చేశారు. చూస్తుండగానే కొంత మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.
అక్కడే ఉన్న కొంత మంది ఆ ఘటనను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. అయితే.. బాధితులు సురక్షితంగా బయటపడ్డారా, లేదా అనే విషయంపై మాత్రం తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.