యాప్నగరం

సముద్రం నుంచి బుల్లెట్ రైల్: పనులు షురూ!

ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్న ఈ రైలు మార్గం మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ మార్గంలో దాదాపు 7 కిలోమీటర్లు..

TNN 19 Feb 2017, 10:14 pm
ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్న ​ బుల్లెట్ రైలు మార్గం.. మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ మార్గంలో దాదాపు 7 కిలోమీటర్లు.. సముద్ర గర్భం నుంచి వెళ్లనుంది. ఇందుకు అవసరమైన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ మేరకు సముద్ర గర్భంలోని దాదాపు 70 మీటర్ల లోతు నుంచి మట్టిని సేకరించి పరీక్షలు చేస్తున్నారు.
Samayam Telugu drilling the 7 km route of undersea bullet train project at full swing
సముద్రం నుంచి బుల్లెట్ రైల్: పనులు షురూ!


బుల్లెట్ రైలు కోసం ప్రత్యేకంగా కారిడార్ నిర్మిస్తున్నారు. మొత్తం 508 కిమీల దూరంలో 21 కిమీలు సొరంగం, మిగతాది ఎలివేటెడ్(వంతెన) మార్గం. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.97,636 కోట్లు ఖర్చుకానుందని అంచనా. ఇందులో 81 శాతం నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (JICA) రుణంగా అందించనుంది.

2018 కల్లా నిర్మాణ పనులు మొదలుపెట్టి.. 2023 కల్లా అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం అహ్మాదాబాద్ నుంచి ముంబయికి వెళ్లాలంటే దాదాపు ఏడు గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం రెండు గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.