మందుబాబులు పీకల దాకా తాగేసి నడిరోడ్డుపై నానా హంగామా చేసే ఘటనలు తరుచూ చూస్తూనే ఉంటాం. ఈ అలవాటు ఉన్న ఆడవారు పార్టీల్లోనో, ఇంట్లోనో గుట్టుగా తాగుతూ సైలెంట్గా ఉంటుంటారు. అయితే ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువతి మాత్రం రాత్రివేళ రోడ్డు మీదికొచ్చి నానా రచ్చ చేసింది.
Also Read: యడియూరప్పకు షాక్... రాజీనామా చేసిన వారానికే హైకోర్టు నోటీసులు పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా పట్టించుకోకుంటా రోడ్డు మధ్యలో కూర్చుని, పడుకుని హడావుడి చేసింది. వచ్చిపోయే వాహనాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో చోటుచేసుకుంది. యువతి బాగోతాన్ని వీడియో తీసిన కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఆమె చేసిన రచ్చ చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: యడియూరప్పకు షాక్... రాజీనామా చేసిన వారానికే హైకోర్టు నోటీసులు