యాప్నగరం

దుర్గాదేవిని కించపరుస్తూ.. ప్రొఫెసర్ ఎఫ్‌బీ పోస్ట్!

హిందువులు పవిత్రంగా పూజించే దుర్గాదేవిని కించపరుస్తూ ఢిల్లీ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

TNN 24 Sep 2017, 10:09 am
హిందువులు పవిత్రంగా పూజించే దుర్గాదేవిని కించపరుస్తూ ఢిల్లీ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దుర్గామాతగా భక్తుల పూజలు అందుకునే దుర్గమ్మ పట్ల కేదర్ కుమార్ మండల్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్య పదజాలం వాడారు. మండల్ పోస్టుపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మండిపడింది. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. నేషనల్ డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ సెప్టెంబర్ 23న ఆయనపై లోధీ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Samayam Telugu du professor draws flak for caustic remarks on durga
దుర్గాదేవిని కించపరుస్తూ.. ప్రొఫెసర్ ఎఫ్‌బీ పోస్ట్!


భారతీయ పురాణాల్లో దుర్గను వేశ్యగా పేర్కొన్నారంటూ మండల్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఆయన ద్యాల్ సింగ్ కాలేజీలో హిందీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నవరాత్రి వేడుకల సమయంలో చీప్ పబ్లిసటీ కోసమే ఇలా చేస్తున్నారంటూ ఎన్డీటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ వీఎస్ నేగి మండిపడ్డారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టగా.. మండల్ తన ఫేస్‌బుక్ పేజీ నుంచి సదరు పోస్టును తొలగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.