యాప్నగరం

Sabarimala Hundi: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఎక్కడ నుంచైనా స్వామికి కానుకలు

Sabarimala Hundi: కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకోడానికి దేశం నలుమూలల నుంచి భారీగా తరలివస్తారు. మండల కాలం పాటు దీక్ష చేపట్టి, ఇరుముడి తలపై మోసుకుంటూ పవిత్ర పదునెట్టాంబడి మీదుగా స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక, 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు విధి విధానాలను ఖరారు చేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 8 Jun 2023, 6:49 am

ప్రధానాంశాలు:

  • భక్తుల కోసం ఈ కానిక వెబ్‌సైట్ ప్రారంభం
  • టీసీఎస్‌కు అప్పగించిన దేవస్థానం బోర్డు
  • వర్చువల్ క్యూ బుకింగ్‌లోనూ మార్పులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sabarimala
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామికి ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా కానుకలు పంపేలా కొత్త వెబ్‌సైట్‌ను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రారంభించింది. ‘ఈ-కానిక’ పేరుతో ఈ ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ను దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‌ డిజైన్ చేసింది. బుధవారం ఈ వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయబోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్‌కు మొదటి కానుకను టీసీఎస్ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ సమర్పించారు. ఈ-కానిక ద్వారా అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని ట్రావెన్ కోర్డు దేవస్థానం బోర్డు భావిస్తోంది.
ఇక, మాస పూజల కోసం శబరిమల ఆలయాన్ని జూన్‌ 15న తెరవనుండగా.. నాలుగు రోజులు స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక, స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వర్చువల్‌ క్యూ విధానాన్ని గతంలో ప్రవేశపెట్టారు. ఈ క్యూ బుకింగుకు సంబంధించిన వెబ్‌సైట్‌‌ను టీసీఎస్‌కు అప్పగించింది. వచ్చే నెలలోగా ఇది అందుబాటులోకి రానుంది. అలాగే గతేడాది మండల-మకర విలక్కు సీజన్‌లో అయ్యప్ప ఆలయానికి దండిగా ఆదాయం వచ్చింది. 2022లో రూ.330 కోట్ల వార్షికాదాయం సమకూరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

పతనంతిట్ట జిల్లాలోని ఉన్న అయ్యప్ప ఆలయంలో ఏటా నిర్వహించే మండల, మకరవిలక్కు పూజలు ముఖ్యమైనవి. రెండు నెలల పాటు కొనసాగే ఈ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రతి మొదటి తమిళ, మలయాళ నెలలో ఐదు రోజులు తెరిచి పూజలు నిర్వహిస్తారు. వృద్దులు, దివ్యాంగులు వంటి వాళ్లకు ఇకపై శబరిగీరిశుడ్ని దర్శించుకునే అవకాశం ట్రావెన్‌కోర్ దేవస్థానం కల్పించనుంది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.