యాప్నగరం

తొందరగానే కరుణించనున్న వరుణుడు!

మండుతున్న ఎండలతో హడలెత్తిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది..

TNN 11 May 2017, 7:32 pm
మండుతున్న ఎండలతో హడలెత్తిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత తీరం తాకనున్నాయట. మరో 5, 6 రోజుల్లోనే అవి అండమాన్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అవి తెలుగు రాష్ట్రాలకు చేరడానికి మరో 10 రోజుల వరకూ పడుతుంది లెండి. అంటే మొత్తం మీద మే నెల చివరి వారంలోనే మనల్ని చిరుజల్లులు పలకరిస్తాయన్నమాట. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. క్యుములోనింబస్ మేఘాలు, ముందస్తు జల్లుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి.
Samayam Telugu early monsoons this year weather conditions indicates
తొందరగానే కరుణించనున్న వరుణుడు!


మరోవైపు ఈ ఏడాది వర్షపాతం కూడా బాగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాల ప్రవేశం, విస్తరణకు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోని వాతావరణం అనుకూలంగా ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉష్ణ వాతావరణం.. రుతువపనాల ముందస్తు ఆగమనానికి సూచిక అని అధికారులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.