యాప్నగరం

అసోంలో భూకంపం.. బెంగాల్లోనూ ప్రకంపనలు.. వణికిన జనం

బుధవారం ఉదయం 10.20 గంటలకు ఈశాన్య రాష్ట్రమైన అసోంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూమి కంపించింది.

Samayam Telugu 12 Sep 2018, 11:25 am
ఈశాన్య రాష్ట్రమైన అసోంను భూ ప్రకంపనలు వణికించాయి. బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో అసోంలో భూమి కంపించింది. కొక్రాజర్ వద్ద భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. పది సెకన్ల పాటు భూమి కంపించిందని గౌహతి వాసులు తెలిపారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, బెంగాల్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు. భూ ప్రకంపనలతో అప్రమత్తమైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు.
Samayam Telugu earthquake assam


ఈ రోజు (బుధవారం) ఉదయం జమ్మూ కశ్మీర్, హర్యానాల్లోనూ స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 5.43 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూమి కంపించింది. అంతకు ముందు 5.15 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.

గత ఆదివారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిన సంగతి తెలిసిందే. దేశరాజధానితోపాటు పొరుగున ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ భూమి కంపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.