యాప్నగరం

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం!

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంపం ఎక్కడికక్కడ స్థానికులని ఇళ్లలోంచి బయటికి పరుగులు..

TNN 7 Feb 2017, 8:52 am
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీఘర్, డెహ్రాడూన్, ఆగ్రా వంటి ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూమి 30 సెకన్లపాటు కంపించింది. ఉత్తర భారతాన్ని వణికించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంపం ఎక్కడికక్కడ స్థానికులని ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసేలా చేసింది.
Samayam Telugu earthquake in uttarakhand strong tremors felt across northern india
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం!


ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ భూకంపం కేంద్రీకృతమై వున్నట్టు భారత వాతావరణ శాఖ గుర్తించింది. కానీ యూరోపియన్ మెడిటేరియన్ సిస్మలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ), యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) గుర్తించిన ఆధారాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని పీపల్‌కోటి కేంద్రంగా ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది.

భూకంపం ప్రభావం అధికంగా వున్న రుద్రప్రయాగ్‌లో సహాయ కార్యక్రమాల నిమిత్తం 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని పంపించింది కేంద్రహోంశాఖ. సోమవారం రాత్రి నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు కేంద్రహోంశాఖ స్పష్టంచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.