యాప్నగరం

గుజరాత్‌లో మళ్లీ భూకంపం

Earthquake: గుజరాత్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. రాజ్‌కోట్‌కు 270 కి.మీ. దూరంలో బూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 26 Feb 2023, 6:55 pm
గుజరాత్‌ మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం (ఫిబ్రవరి 26) మధ్యాహ్నం 3.21 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాజ్‌కోట్‌‌కు ఉత్తర వాయవ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. భూమిలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.
Samayam Telugu Earthquake
భూకంపం


ఉత్తర భారతదేశంలో ఈ నెలలో భూకంపం రావడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 22న ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించారు. ఫిబ్రవరి 4న గుజరాత్‌లోని అమ్రేలిలో భూకంపం చోటు చేసుకుంది. ఉదయం 7.41 గంటలకు 3.2 తీవ్రతతో భూమి కంపించింది. రెండు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వరుస భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.