యాప్నగరం

గుజరాత్‌లో భూకంపం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం

Rajkot: రిక్టార్ స్కేలుపై 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం గుజరాత్ ప్రజలను వణికించింది. రాజ్‌కోట్, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జనం ఇళ్లలోంచి పరుగులు తీశారు.

Samayam Telugu 15 Jun 2020, 1:29 am
గుజరాత్‌లో భూకంపం చోటు చేసుకుంది. ఆదివారం (జూన్ 14) రాత్రి 8.13 గంటల సమయంలో రాజ్‌కోట్‌, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లల్లో వస్తువులు, ఫ్యాన్లు కదిలాయి. భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు.
Samayam Telugu గుజరాత్ భూకంపం
Gujarat Earthquake


గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. రాజ్ కోట్, కచ్, పఠాన్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడారు. భూకంపం పరిస్థితిపై సమీక్షించారు. రిక్టార్ స్కేలుపై 5 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలను ప్రమాదకరమైనవిగా చెప్తారు. ఈ నేపథ్యంలో గుజరాత్ వాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ భూకంపం కారణంగా కచ్ ప్రాంతంలో కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. టర్కీలోనూ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.

భూకంపంతో ఆందోళనకు గురైనట్లు పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. ‘2020 ఎంత భయంకరమైంది?’ అని పలువురు ట్వీట్ చేశారు. 2001లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన భూకంపాన్ని గుర్తుచేసుకొని పలువురు ఆందోళనకు గురయ్యారు. నాడు గణతంత్ర దినోత్సవం (2001 జనవరి 26) రోజున ఉదయం 8.45 గంటల సమయంలో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.

భారతదేశ చరిత్రలో అత్యంత భయానక భూకంపంగా 2001 నాటి కచ్ భూకంపం మిగిలిపోయింది. రిక్టార్ స్కేలుపై 7.7గా నమోదైన ఈ భూకంపం కారణంగా ఒక్క గుజరాత్‌లోనే 12 వేల మందికి పైగా మరణించారు. పాకిస్థాన్ సహా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న భూ ప్రకంపనల్లో మొత్తం 20 వేల మందికి పైగా మరణించారు.


Also Read: కరోనా దేవీ.. కాపాడు తల్లీ! కేరళలో నిత్య పూజలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.