యాప్నగరం

ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం..

ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. బుధవారం (జనవరి 31) మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో ఢిల్లీ, హర్యాణా, పంజాబ్‌తో పాటు కశ్మీర్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది.

TNN 31 Jan 2018, 1:06 pm
ఉత్తర భారతదేశాన్ని భూకంపం మరోసారి వణికించింది. బుధవారం (జనవరి 31) మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో ఢిల్లీ, హర్యాణా, పంజాబ్‌తో పాటు కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత పాదాల వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ కారణంగా హిందూకుష్ పర్వత పరిధిలోని అఫ్గాన్‌తో పాటు పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
Samayam Telugu earthquake tremors felt in delhi ncr
ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం..


భూకంపం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో వీధుల్లోకి పరుగెత్తుకొచ్చారు. భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Earthquake (#भूकंप) possibly felt 2 min ago in #National Capital Territory of Delhi #India. https://t.co/wPtMW5ND1t pic.twitter.com/LJ6Jl5e0Gx — EMSC (@LastQuake) January 31, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.