యాప్నగరం

ఈసీని ధ్రుతరాష్ట్రునితో పోల్చిన కేజ్రీవాల్

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర అసహనంలో కూరుకుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

TNN 10 Apr 2017, 4:19 pm
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర అసహనంలో కూరుకుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌ను మహాభారతంలో ధ్రుతరాష్ట్రునితో పోల్చారు. అధికారం కోసం ధ్రుతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడికి సాయం చేసినట్లు బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ యంత్రాలు ట్యాంపరింగ్ అయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని కేజ్రీవాల్ కోరారు.
Samayam Telugu ec behaving like dhritarashtra to help duryodhan says arvind kejriwal
ఈసీని ధ్రుతరాష్ట్రునితో పోల్చిన కేజ్రీవాల్


ఏప్రిల్ 23 న జరగనున్న దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాజస్థాన్‌ నుంచి ఈవీఎంలు తెప్పిస్తున్నారని... అవసరమైనన్ని దేశ రాజధానిలో ఉంటే అక్కడ నుంచి తీసుకురావడమేంటని ఆరోపించారు. దీని వల్ల ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయా అంటూ ఈసీని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ ఉప ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు ఏ పార్టీకి ఓటేసినా అవి భాజపాకే పడ్డాయని, ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.

Why defectiv EVMs voting only BJP? They not "defective". Their software changed. Let EC give us one of these EVM, we'll prove they r tamperd https://t.co/BOzfKcMwTZ — Arvind Kejriwal (@ArvindKejriwal) April 9, 2017 గోవా, పంజాబ్‌లో అధికారం హస్తగతం చేసుకుంటామని భావించిన అమ్ ఆద్మీ పార్టీ నేతకు ఫలితాలు ఊహించని విధంగా వెలువడంతో ఖంగుతిన్నారు. పంజాబ్‌లో అధికారం చేపట్టాలని భావించిన కేజ్రీవాల్ ఆశలు అడియాసలు అయ్యాయి. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లను వినియోగించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.