యాప్నగరం

సాక్షి మహారాజ్‌కు ఈసీ నోటీసులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది.

TNN 10 Jan 2017, 4:48 pm
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో సాక్షి మహరాజ్ ప్రసంగిస్తూ మతపూరిత మైన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ఈసీ వివరణ కోరుతూ సాక్షికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11లోగా వివరణను పంపించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రసంగాలలో కులం, మతాల నుద్దేశించి ప్రసంగించకూడదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
Samayam Telugu ec issues notice to bjps sakshi maharaj
సాక్షి మహారాజ్‌కు ఈసీ నోటీసులు


సాక్షి మహారాజ్ నాలుగు రోజుల క్రితం మీరట్ లో మాట్లాడుతూ ముస్లిం నుద్దేశించి నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు, మూడు విడాకులు తీసుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు. ఇలా చేయడం వల్ల దేశం రెండు ముక్కలవుతుందని అన్నారు. గతంలో కూడా హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది.

సాక్షి మహరాజ్ మాట్లాడుతూ తాను మతం గురించి మాట్లాడలేదని అన్నారు. కావాలంటే ఒకసారి వీడియో చూసుకోవచ్చని చెప్పారు. దేశంలో పెరుగుతున్న జనాభా గురించే అలా అన్నానని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.