యాప్నగరం

శశికళకు ఎన్నికల కమిషన్ షాక్!!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైన వీకే శశికళకు కేంద్రం ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

TNN 8 Feb 2017, 12:46 pm
దివంగ‌త నేత జయలలిత మరణించిన నెల రోజులకే హ‌డావుడిగా స‌మావేశం ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శశికళను ఎన్నుకోవ‌డంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంత హ‌డావుడిగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏముందని ప్ర‌శ్నించింది. అన్నాడీఎంకే నియ‌మావ‌ళిలో అసలు తాత్కాళిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వే లేదంటూ వ్యాఖ్యానించింది. అలాంట‌ప్పుడు ఎన్నికను ఎలా నిర్వహిస్తారని ఘాటుగా స్పందించింది.
Samayam Telugu ec shock to vk sasikala over general secretary post
శశికళకు ఎన్నికల కమిషన్ షాక్!!


దీంతో శ‌శిక‌ళకు మ‌రో గట్టి షాక్ త‌గిలింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీని ఆదేశించింది. అన్నాడీఎంకే నుంచి ఈసీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి. ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలంటే పార్టీలో కనీసం ఆరేళ్లకు మించి సుధీర్ఘ సభ్యత్వం ఉండాలి. అయితే శశికళకు పార్టీలో సభ్యత్వమే లేకుండా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం నియమావళికి విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గతంలో చిన్మమ్మను జయలలిత పోయెస్‌గార్డెన్ నుంచి బయటకు తరిమేశారు. అంతే కాదు పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. దీంతో ఆమె సభ్యత్వం రద్దయింది. ఈసీ అభ్యంతరాలతో తమిళ రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఓ పక్క అమ్మ వీరవిధేయడు పన్నీర్ సెల్వం తిరుగుబావుటా ఎగరేసి శశికళకు పంటికింద రాయిలా తయారయ్యారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.