యాప్నగరం

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్రం ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేయనుంది.

TNN 4 Jan 2017, 11:29 am
ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపురి, గోవా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ఈ రోజు విడుదల చేయనుంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో ఏడు దశల్లోనూ, మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనూ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అయితే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పరిస్థితులు ఆందోళకరంగా ఉండటంతో వివిధ దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Samayam Telugu ec to announce poll dates for five states upcoming assembly elections
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల


యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలో ఎన్నికల అధికారులతో మంగళవారం ఈసీ సమావేశం నిర్వహించింది. మణిపూర్‌లోని నాగా తీవ్రవాదులు రోడ్లను నిర్బంధించిన అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం 85,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగించనుంది. వీరితో పాటు స్టేట్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన మరో 100 కంపెనీల బలగాలను కూడా అదనంగా పంపనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.