యాప్నగరం

అక్రమ చొరబాట్లలో ఆ దేశీయులే ఎక్కువ!

దేశ భద్రత, ఆర్థిక వ్యవహారాలకు చొరబాట్లు పెద్ద సవాలుగా మారాయి. దేశంలో ఉపాధి కోసం కొందరు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం మరికొందరు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

TNN 29 Nov 2016, 2:08 pm
దేశ భద్రత, ఆర్థిక వ్యవహారాలకు చొరబాట్లు పెద్ద సవాలుగా మారాయి. దేశంలో ఉపాధి కోసం కొందరు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం మరికొందరు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధి.. ఈ అక్రమ చొరబాట్లకు ఊతమిస్తోంది. చాలా మంది సరిహద్దుల్లో భారత జవాన్లకు పట్టుబడుతుండగా.. మరికొందరు కాల్పుల్లో మరణిస్తున్నారు. ఈ ఏడాది (2016)లో ఇప్పటి వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ దేశాల నుంచి 2,187 మంది అక్రమంగా చొరబడ్డారు. వీరిలో 68 మంది భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు. ఈ మరణాల్లో అత్యధికం పాక్-ఇండో బోర్డర్‌లోనే చోటు చేసుకున్నాయి. పాక్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేవారిని ఉగ్రవాదులుగా భావిస్తూ కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో.. ఇండో -పాక్ బోర్డర్‌లో 39 మంది మరణించారు. ఇండో - మయన్మార్‌లో 14, ఇండో - బంగ్లా సరిహద్దుల్లో 15 మంది చనిపోయారు. అయితే, దేశంలోకి అత్యధిక చొరబాట్లు బంగ్లాదేశ్, మయన్మార్‌ నుంచే జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ గణంకాలు తెలుపుతున్నాయి.
Samayam Telugu economics more than terrorism inspires illegal border crossings into india
అక్రమ చొరబాట్లలో ఆ దేశీయులే ఎక్కువ!


ఈ ఏడాది దేశంలోకి చొరబడుతూ పట్టుబడినవారు, చనిపోయినవారి వివరాలు ఇలా ఉన్నాయి.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.