యాప్నగరం

ఈసీ ఈవీఎం ఛాలెంజ్: రెడీ అయిన ఒకే పార్టీ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) ట్యాంపరింగ్ అయినట్లు వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఎన్నికల

TNN 26 May 2017, 7:42 pm
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) ట్యాంపరింగ్ అయినట్లు వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఎన్నికల సంఘం జూన్ 3న ‘ఛాలెంజ్’ నిర్వహించనుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈవీఎంలు ట్యాంపర్ కావని చెబుతున్న ఈసీ.. ఆరోపణలు చేసేవారు....వాటిని తమ వద్ద నిరూపించాలని అన్ని రాజకీయపార్టీలను ఆహ్వానించింది.
Samayam Telugu ecs evm challenge ncp only party to participate to check out tampering
ఈసీ ఈవీఎం ఛాలెంజ్: రెడీ అయిన ఒకే పార్టీ


అయితే ఈసీ సవాల్ ను నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్సీపీ) మాత్రమే స్వీకరించింది. ఈసీ ఈవీఎం ఛాలెంజ్ లో తమ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని ఎన్సీపీ ముగ్గురు ప్రతినిధుల జాబితాను ఈసీకి పంపించింది.

మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ ల నుంచే ఈవీఎంలను తెప్పించి రాజకీయ పార్టీల ముందు ప్రదర్శించాలని ఈసీ నిర్ణయించింది.

అయితే తాము లేవనెత్తిన అనుమానాలను ఈసీ నివృత్తి చేయకపోవడంతో ఈసీ ఈవీఎం ఛాలెంజ్ లో పాల్గొనబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ అయినట్లు ఆప్, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.