యాప్నగరం

జకీర్ నాయక్ పై క్రిమినల్ కేసు నమోదు

జకీర్ నాయక్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసు నమోదు చేసింది.

TNN 30 Dec 2016, 6:48 pm
ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆయన ఉగ్రవాదసంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ జకీర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దానిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈడీ ఆయనపైనా, ఆయనకు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ పైనా కూడా క్రిమినల్ కేసు నమోదు చేసింది. అతని సంస్థపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది. జాతి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సంస్థ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తూ నిషేధం విధించింది. జకీర్ కొన్ని నెలలుగా విదేశాల్లోనే ఉంటున్నాడు. భారత్ వస్తే అరెస్టు చేస్తారన్న భయంతో అతను రావడం లేదు.
Samayam Telugu ed registers money laundering case against zakir naik
జకీర్ నాయక్ పై క్రిమినల్ కేసు నమోదు


బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాది తాను జకీర్ నాయక్ ప్రసంగాలు విని ఉత్తేజితమయ్యానని చెప్పాడు. అప్పట్నించి జకీర్ పై నిఘా ఉంచింది ప్రభుత్వం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.