యాప్నగరం

సందేశారా కుంభకోణం.. అహ్మద్ పటేల్ నివాసానికి ఈడీ

బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణం తీసుకుని, తర్వాత చెల్లించకుండా ఎగ్గొట్టిన ఓ మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పాత్ర కూడా ఉందని సీబీఐ అనుమానిస్తోంది.

Samayam Telugu 27 Jun 2020, 2:38 pm
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ నివాసానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం వెళ్లారు. వేలకోట్ల రూపాయల విలువైన సందేశారా సోదరుల కుంభకోణానికి సంబంధించిన కేసులో అహ్మద్ పటేల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం క్రింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని మథర్ థెరిస్సా క్రీసెంట్ నివాసానికి చేరుకున్న అధికారులు.. పటేల్‌ వాంగూల్మం నమోదుచేసినట్టు తెలిపారు.
Samayam Telugu కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్
Enforcement Directorate


కాగా, ఈ కేసు విచారణకు హాజరు కావాలని అహ్మద్‌ పటేల్‌కు ఈడీ గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే 60 ఏళ్లు దాటినవారు ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం... తాను హాజరు కాలేనంటూ అహ్మద్‌ పటేల్‌ తన అశక్తత తెలియజేశారు. ఆయన విన్నపాన్ని మన్నించిన ఈడీ.. దర్యాప్తు బృందాన్ని మధ్య దిల్లీలోని మదర్‌ థెరిసా క్రిసెంట్‌ వద్దనున్న ఆయన ఇంటికే పంపింది.

గుజరాత్‌కు చెందిన స్టెర్టింగ్‌ బయోటెక్‌ సంస్థ బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణాలు తీసుకుని... చెల్లించకపోవడంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. రుణాల ఎగవేతలో స్టెర్టింగ్ యాజమాన్యం చేతన్ సందేశారా‌, నితిన్‌ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసులో సీబీఐ 2017 అక్టోబర్‌‌లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కంటే సందేసారా కుంభకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.