యాప్నగరం

సెల్ఫీ సరదాకు ఎనిమిది ప్రాణాలు బలి

ప్రమాదకర పరిస్థితుల్లోనూ యువత సెల్ఫీ సరదాను వీడడంలేదు. ప్రమాదమని తెలసినీ సరదాగా కోసం సెల్ఫీలు దిగి ప్రాణాల మీదికి తెచ్చికుంటున్నారు.

TNN 11 Jul 2017, 9:57 am
ప్రమాదకర పరిస్థితుల్లోనూ యువత సెల్ఫీ సరదాను వీడడంలేదు. ప్రమాదమని తెలసినీ సరదాగా కోసం సెల్ఫీలు దిగి ప్రాణాల మీదికి తెచ్చికుంటున్నారు. ఇది కూడా అలాంటి ఘటనే. మిత్రుడి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా చిన్న పడవలో ఓ జలాశయంలోకి వెళ్లిన స్నేహితులంతా సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి 25 కిలోమీటర్ల దూరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu eight dead as boat capsizes in nagpurs vena dam
సెల్ఫీ సరదాకు ఎనిమిది ప్రాణాలు బలి


నాగ్‌పూర్ పట్టణానికి చెందిన తొమ్మిది మంది యువకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి కమలేశ్వర్ ప్రాంతంలో ఉన్న వెనా జలాశయం వద్దకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పడవలో వెనా డ్యాంలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. పడవ డ్యాం మధ్యలోకి చేరుకున్నాక సెల్ఫీ తీసుకుంటుండగా.. అందరూ ఒక వైపునకు రావడంతో పడవ మునిగిపోయింది. ఆ సమయంలో పడవ నడిపే వారితో కలిపి మొత్తం 11 మంది పడవలో ఉన్నారు.

మునిగిపోయిన వారిలో ముగ్గురు మాత్రం అతికష్టం మీద ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రానికి ఏడు మృతదేహాలను వెలికితీయగా.. మంగళవారం ఉదయం మరో మృతదేహాన్ని వెలికితీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.