యాప్నగరం

ఆ 8మంది దుర్మార్గులకు ఉరిశిక్ష

21 ఏళ్ల విద్యార్థిని దారుణంగా హతమార్చిన 8మంది కిరాతకులకు కోల్కతా హైకోర్టు మరణశిక్ష విధించింది

TNN 19 Apr 2016, 10:44 pm
తమ అక్రమ సారా వ్యాపారానికి అడ్డువచ్చాడనే అక్కసుతో 21 ఏళ్ల విద్యార్థిని దారుణంగా హతమార్చిన 8మంది కిరాతకులకు కోల్కతా హైకోర్టు మరణశిక్ష విధించింది. 21 ఏళ్ల సౌరవ్ చౌదరి అనే విద్యార్థిని రెండేళ్ల క్రితం వీరు హతమార్చినట్లు హైకోర్టు విశ్వసించిన నేపథ్యంలో వారికి మరణశిక్షను ఖరారు చేసింది.
Samayam Telugu eight get death sentence for murder of bengal student sourav chowdhury
ఆ 8మంది దుర్మార్గులకు ఉరిశిక్ష


పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలోని బామాన్ గచ్చి ప్రాంతానికి చెందిన సౌరవ్ చౌదరి అనే విద్యార్థికి రెండేళ్ల క్రితం తన ప్రాంతంలో జరుగుతున్న అక్రమ సారా వ్యాపారం, గూండాల దందా గురించి తెలిసింది. మిగిలిన వారికిలాగా అతను దాన్ని పట్టించుకోకుండా వదలివేయలేదు. స్థానికులను కూడదీసి వారి అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి ఊపిరాడనివ్వకుండా చేసాడు. దాంతో ఆగ్రహించిన ముఠా సభ్యులు ఆ విద్యార్థిని అపహరించి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో మొత్తం పద్నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేసి తొలుత విచారణ జరిపారు. కోర్టులో విచారణ సందర్భంగా ఎనిమిదిమందికి మరణ శిక్ష పడగా మరో ఐదుగురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. ఈ హత్యకేసు అప్పట్లో పెద్ద సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.