యాప్నగరం

ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది.

TNN 18 Jun 2017, 6:16 pm
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించిన అంశానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శాఖా మంత్రి సి. విజయభాస్కర్‌, అన్నాడీఎంకే(అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో పాటు మరికొందరిపైనా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక సమయంలో అధికార అన్నాడీఎంకే నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు అప్పట్లో ఓ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే (అమ్మ) నేత, మంత్రి విజయభాస్కర్‌ ఇంటిపై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో దాదాపు రూ. 90 కోట్ల వరకు నగదు పంపిణీకి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu election commission directs fir against cm palaniswami
ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్..


ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు తేలడంతో ఎన్నికల సంఘం నాటి ఉప ఎన్నికను రద్దు చేసింది. ఆ ఉదంతంతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ సారథ్యంలో ప్రతిపక్ష డీఎంకే పార్టీ తమిళనాడు గవర్నరు విద్యాసాగర్‌రావును కలిసి డిమాండ్‌ చేసింది. డీఎంకే నేత స్టాలిన్‌ దీనికి సంబంధించి ఓ సీడీని కూడా గవర్నర్‌కు అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.