యాప్నగరం

సైకిల్ గుర్తు ఎవరిదో ఆ రోజే తేల్చనున్న ఈసీ

ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ ముసలం మొదలైన సంగతి తెలిసిందే.

TNN 10 Jan 2017, 4:35 pm
ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ ముసలం మొదలైన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి అసలైన సమాజ్ వాదీ పార్టీ తమదేనంటూ వాదులాడుకుంటున్నారు. అఖిలేష్ వర్గం, ములాయం వర్గం విడివిడిగా ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ ను కలిసి సైకిల్ గుర్తు తమకే రావాలని విజ్ఞప్తి చేసి వచ్చారు. రెండు వర్గాల విజ్ఞప్తులను స్వీకరించిన ఈసీ ఈ నెల 13న ఆ కథకి ముగింపు పలకనుంది. రెండు వర్గాల్లో దేనిని సైకిల్ గుర్తు చెందుతుందో ఆ రోజే నిర్ణయించనుంది. జనవరి 13న అంటే శుక్రవారం అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ వర్గాల వాదనలు ఈసీ విననుంది. ఇరు వర్గల వాదన విన్నాక సైకిల్ గుర్తు ఎవరిదో ప్రకటించనుంది. ఈలోపే తండ్రీ కొడుకులు కలిసిపోతే మరే సమస్య లేదు. సైకిల్ గుర్తు మీదే ములాయం, అఖిలేష్ వర్గాలు రాజీకి వచ్చి కలిసి పోటీ చేస్తాయి.
Samayam Telugu election commission will decide who controls cycle symbol in sp
సైకిల్ గుర్తు ఎవరిదో ఆ రోజే తేల్చనున్న ఈసీ


తాజా పరిణామం ప్రకారం మంగళవారం అఖిలేష్ తండ్రిని ఇంటికెళ్లి కలిసి వచ్చారు. అయితే వారిద్దరి మధ్య రాజీ కుదిరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారిద్దరూ మాత్రం నోరు విప్పి ఇంకా ఏమీ చెప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.