ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్న తరుణంలో బీజేపీ విమర్శల పర్వం కొనసాగుతోంది. యూపీ తూర్పు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ప్రియాంకు అప్పగించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4న ప్రియాంక బాధ్యతలు స్వీకరించనున్నారు. తాజాగా ప్రియాంక రాజకీయ అరంగేట్రంపై బీజేపీ సీనియర్ నేత, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలంటే అందాల పోటీలు కాదని, గత సామర్థ్యం ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. ఆదివారం కోల్కతాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి హాజరైన సుశీల్ మోదీ మాట్లాడుతూ.. ‘ఎన్నికలంటే రెజ్లింగ్, అందాల పోటీలు లేదా మరెంకేదో పోటీ కాదు. ఇవి రాజకీయ పోటీ. ఈ పోటీలో నాయకుల సామర్థ్యం ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు’ అని ప్రియాంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
రెండు రోజుల కిందట కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి జీవిత భాగస్వామికి పార్టీ బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ సంతోషపడుతందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆమెను కాంగ్రెస్ నేతలు తన నాయినమ్మ ఇందిరతో పోల్చుతున్నారని, ఒక వ్యక్తి సామర్ధ్యంతో సరిపోల్చితే ఇప్పుడు చాలా మంది విరాట్ కోహ్లీలు, అమితాబచ్చన్లు ఉన్నారు.. నకిలీలు రాజకీయాల్లోకి పనికిరారు.. ఒకవేళ ప్రియాంకను ఇందిరతో పోల్చినా ఎంతో తేడా ఉందంటూ ట్వీట్ చేశారు.
ప్రియాంకలో అందం తప్ప చెప్పుకోదగ్గ గొప్ప లక్షణమేదీ లేదని, అందానికి ఓట్లు రాలవని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని బీహార్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ శాఖ మంత్రి వినోద్ నారాయణ్ ఝా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకకు ప్రకృతి వరమిచ్చింది... ఆమెలో అందం తప్ప ఇతర గొప్ప లక్షణాలేమీ కనిపించడం లేదు. కానీ ఓట్లను రాబట్టుకోడానికి అందం ఒక్కటే చాలదని కాంగ్రెస్ నేతలు గుర్తించాలి... ఆమెకు అనుభవం లేదు... మరోవైపు ఆమె భర్త రాబర్ట్ వాద్రా తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు’ అని ఝా అన్నారు.
సుశీల్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం దీటుగానే బదులిచ్చారు. ‘గాంధీ కుటుంబానికి భయపడి బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ రాజకీయాలను ఆ కుటుంబం మలుపు తిప్పగలదని వారికి తెలుసు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన పెరిగి, భయం పట్టుకుందని, నోటికొచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ భట్టాచార్య ధ్వజమెత్తారు.
రెండు రోజుల కిందట కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి జీవిత భాగస్వామికి పార్టీ బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ సంతోషపడుతందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆమెను కాంగ్రెస్ నేతలు తన నాయినమ్మ ఇందిరతో పోల్చుతున్నారని, ఒక వ్యక్తి సామర్ధ్యంతో సరిపోల్చితే ఇప్పుడు చాలా మంది విరాట్ కోహ్లీలు, అమితాబచ్చన్లు ఉన్నారు.. నకిలీలు రాజకీయాల్లోకి పనికిరారు.. ఒకవేళ ప్రియాంకను ఇందిరతో పోల్చినా ఎంతో తేడా ఉందంటూ ట్వీట్ చేశారు.
ప్రియాంకలో అందం తప్ప చెప్పుకోదగ్గ గొప్ప లక్షణమేదీ లేదని, అందానికి ఓట్లు రాలవని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని బీహార్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ శాఖ మంత్రి వినోద్ నారాయణ్ ఝా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకకు ప్రకృతి వరమిచ్చింది... ఆమెలో అందం తప్ప ఇతర గొప్ప లక్షణాలేమీ కనిపించడం లేదు. కానీ ఓట్లను రాబట్టుకోడానికి అందం ఒక్కటే చాలదని కాంగ్రెస్ నేతలు గుర్తించాలి... ఆమెకు అనుభవం లేదు... మరోవైపు ఆమె భర్త రాబర్ట్ వాద్రా తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు’ అని ఝా అన్నారు.
సుశీల్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం దీటుగానే బదులిచ్చారు. ‘గాంధీ కుటుంబానికి భయపడి బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ రాజకీయాలను ఆ కుటుంబం మలుపు తిప్పగలదని వారికి తెలుసు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన పెరిగి, భయం పట్టుకుందని, నోటికొచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ భట్టాచార్య ధ్వజమెత్తారు.