యాప్నగరం

పంజాబ్, గోవాలో ప్రారంభమైన పోలింగ్

శాసనసభ స్థానాల కోసం పంజాబ్, గోవా రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లో 117 స్థానాలకిగాను..

TNN 4 Feb 2017, 9:02 am
శాసనసభ స్థానాల కోసం పంజాబ్, గోవా రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లో 117 స్థానాలకిగాను మొత్తం 1145 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. ఎన్నికలు సజావుగా సాగడానికి ఇరు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించిన ఎన్నికల సంఘం పంజాబ్‌లో 200 కంపెనీలు, గోవాలో 90 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించింది.
Samayam Telugu elections in punjab goa started
పంజాబ్, గోవాలో ప్రారంభమైన పోలింగ్


పంజాబ్‌లో పోలింగ్ ఉదయం 8 గంటలకి ప్రారంభం కాగా, గోవాలో 40 స్థానాలకి జరుగుతున్న ఎన్నికలు ఉదయం 7 గంటలకే ప్రారంభమయ్యాయి.
పంజాబ్‌లో అధికారం కోసం పోటీపడుతున్నవారిలో శిరోమణి అకాలి దళ్ (ఎస్ఏడీ) తరపున జనరల్ జేజే సింగ్, కాంగ్రెస్ పార్టీ తరపున అమరీందర్ సింగ్ ఉన్నారు.అమృత్ సర్ పార్లమెంట్ స్థానానికి కూడా ఇవాళే ఉప ఎన్నిక జరగనుంది.

గోవాలో కేంద్రమంత్రి మనోహర్ పారికర్, ఆ రాష్ట్ర సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్, పంజాబ్ లో ఎస్ఏడీ అభ్యర్థి జేజే సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత ఓటింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా మోడీ పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.