యాప్నగరం

నక్సల్ దాడిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు.. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డారు.

TNN 11 Mar 2017, 12:27 pm
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు.. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) జవాన్లపై మావోయిస్టులు ఆకస్మికదాడికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా బెజ్జి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన మరో ఇద్దరు జవాన్లను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu eleven crpf men killed in naxal attack in sukma district
నక్సల్ దాడిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి


మరణించిన జవాన్ల దగ్గర నుంచి ఆయుధాలు, రేడియో సెట్లను మావోయిస్టులు అపహరించుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పులు ప్రస్తుతం ముగిసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.