యాప్నగరం

జ్యోతిష్యుడి తెలివి.. దొంగతనానికీ ముహూర్తం

కోటీశ్వరుడు కావాలనే తలంపుతో ఓ జ్యోతిష్యుడ్ని ఆశ్రయించిన చిరుద్యోగి చివరికి కటకటాలపాలయ్యాడు. తన జాతకం ఎలా ఉందో

TNN 12 Oct 2017, 8:32 pm
కోటీశ్వరుడు కావాలనే తలంపుతో ఓ జ్యోతిష్యుడ్ని ఆశ్రయించిన చిరుద్యోగి చివరికి కటకటాలపాలయ్యాడు. తన జాతకం ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్లి.. చివరికి అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేసి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. బెంగళూరు‌లో‌ని ఓ ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్న దామోదర్ తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని.. వాటి నుంచి బయటపడే మార్గం చెప్పాల్సిందిగా కృష్టంరాజు అనే జ్యోతిష్యుడ్ని కలిశాడు. దీనికి కృష్టంరాజు అతని జాతకం చూసినట్లు నటించి.. పని చేస్తున్న సంస్థలోనే ఓ శుభ ముహూర్తంలో వరుసగా దొంగతనం చేయాల్సిందిగా సూచించాడు.
Samayam Telugu employee arrested in bengalore for stealing computer monitors
జ్యోతిష్యుడి తెలివి.. దొంగతనానికీ ముహూర్తం


తొలుత శ్రావణ మాసంలో దొంగతనం మొదలెట్టి.. దాన్ని వేరే వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే ఎక్కువ లాభాలొస్తాయని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన దామోదరం మిత్రులతో కలిసి తాను పనిచేస్తున్న సంస్థ నుంచి సుమారు రూ.49 లక్షలు విలువ చేసే కంప్యూటర్ మానిటర్లని దొంగతనం చేసి విక్రయించాడు. వచ్చిన ఆదాయంలో కృష్టంరాజుకి కొంత ఇచ్చి.. మిత్రులతో పంచుకోసాగాడు. అయితే.. అనుమానం వచ్చిన యాజమాన్యం పోలీసులకి ఫిర్యాదు చేయగా.. జోతిష్యం ఆధారంగా దొంగతనం గుట్టు వీడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.