యాప్నగరం

విధులకు సరిగా హాజరు కావడంలేదని మహిళా ఉద్యోగిపై..

విధులకు సరిగా హాజరు కావడంలేదని ఓ యజమాని.. ఉద్యోగినిపై యాసిడ్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులోని మడిపక్కంలో జరిగింది.

TNN 19 Feb 2018, 8:46 pm
విధులకు సరిగా హాజరు కావడంలేదని ఓ యజమాని.. ఉద్యోగినిపై ఊహించనివిధంగా దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని మడిపక్కంలో జరిగింది. యమున (33) అనే మహిళ కొన్ని నెలలుగా ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పార్ట్‌టైం ఉద్యోగినిగా పని చేస్తోంది. అయితే.. ఆమె విధుల్లో చేరినప్పటి నుంచి ల్యాబ్‌కు సరిగా రావడం లేదు. ఈ విషయంలో ల్యాబ్ యజమాని రాజేష్.. పలుమార్లు హెచ్చరించినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో వాగ్వివాదం జరిగినట్లు సమాచారం.
Samayam Telugu employer attacks with acid on woman employee in tamil nadu
విధులకు సరిగా హాజరు కావడంలేదని మహిళా ఉద్యోగిపై..


ఆదివారం (ఫిబ్రవరి 18) సాయంత్రం యమునను ఆలస్యం విషయమై ల్యాబ్ యజమాని మరోసారి ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. సహనం కోల్పోయిన రాజేష్.. ఆమెపై ల్యాబ్ స్పిరిట్ పోసి నిప్పంటించాడు.

వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 46 శాతం కాలిన గాయాలతో యమున ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యమున భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.