ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం తెల్లవారుజామున మల్కన్గిరి ప్రాంతంలో మావోయిస్టు గ్రూప్ పై గ్రేహౌండ్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 18 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం అందింది. అలాగే ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడినట్లు తెలిసింది. కాగా ఈ దాడిలో ఒడిషా కంత్రి దళానికి చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ఎన్ కౌంటర్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..
ఆంధ్ర-ఒడిషా పోలీసులు కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించి మావోయిస్టులను మట్టుబెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టుల ప్లీనరీ జరుగుతుందని ముందస్తుగా సమాచారం అందుకున్న గ్రేహౌంట్స్ సిబ్బంది.. గత రెండు రోజుల నుంచి మల్కన్గిరి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ లో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున.. గుంపుగా ఉన్న మావోయిస్టులను గుర్తించి వారిపై దాడి చేసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా తాజా దాడుల నేపథ్యంలో మావోయిస్టు ప్రతికార దాడులకు తెగబడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏవోబీ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు..కాగా ఈ దాడితో మావోయిస్టు దళానికి భారీ ఎదురుదెబ్బతగిలినట్లయిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్ర-ఒడిషా పోలీసులు కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించి మావోయిస్టులను మట్టుబెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టుల ప్లీనరీ జరుగుతుందని ముందస్తుగా సమాచారం అందుకున్న గ్రేహౌంట్స్ సిబ్బంది.. గత రెండు రోజుల నుంచి మల్కన్గిరి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ లో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున.. గుంపుగా ఉన్న మావోయిస్టులను గుర్తించి వారిపై దాడి చేసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా తాజా దాడుల నేపథ్యంలో మావోయిస్టు ప్రతికార దాడులకు తెగబడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏవోబీ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు..కాగా ఈ దాడితో మావోయిస్టు దళానికి భారీ ఎదురుదెబ్బతగిలినట్లయిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.