యాప్నగరం

పుల్వామాలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

గురువారం ఉదయం భద్రతా బలగాలకి, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకి మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

TNN 9 Mar 2017, 9:40 am
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పద్గంపురలో గురువారం ఉదయం భద్రతా బలగాలకి, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకి మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఏరియాలో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ), కాశ్మీర్ పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇదిలావుంటే, ఉగ్రవాదుల కదలికల సమాచారాన్ని తెలుసుకున్న ఆర్మీ బలగాలు సైతం వారి ఆచూకీ కోసం కూంబింగ్ మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu encounter between security forces and hizbul militants in pulwama
పుల్వామాలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

Jammu and Kashmir: Security forces suspect presence of 2-3 terrorists in Pulwama's Padgampora, gunshots heard. (Visuals deferred) pic.twitter.com/OmIkRRQihw— ANI (@ANI_news) March 9, 2017
గడిచిన నాలుగు రోజుల్లో ఇది రెండవ మేజర్ ఎన్‌కౌంటర్. గత వారమే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అఖీబ్ మౌల్వితోపాటు పాకిస్థాన్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒసామాని భద్రతా బలగాలు ఇదే పుల్వామా జిల్లాలో మట్టుపెట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.