అడవికి రాజైన ఆ సింహాం ఏకంగా రైల్వే ట్రాక్పైనే తిష్ట వేసింది. దానికి తోడుగా మరో రెండు సింహాలు ట్రాక్ పక్కన కూర్చున్నాయి. అటు వైపుగా వస్తున్న రైలు లోకో పైలట్ ఆ సింహాలను గమనించాడు. ట్రెయిన్ను మెల్లిగా నిలిపేశాడు. సింహాల సమీపంలోకి వెళ్లి రైలు ఆగిపోయింది. ఆ తర్వాత లోకో పైలట్లు ట్రెయిన్ హారన్ మోగిస్తూ వాటిని పట్టాల పైనుంచి తరిమే ప్రయత్నం చేశారు. వేటాడటం వల్ల వచ్చిన అలసటేమో.. ఆ సింహాలు మాత్రం అక్కడ నుంచి కదలడానికి ససేమిరా అన్నాయి. విశ్రాంతి తీసుకుంటూ అక్కడే దర్జాగా కూర్చుండిపోయాయి. కాసేపటి తర్వాత ఒక్కొక్కటీ పక్కకు తొలగిపోవడంతో లోకో పైలట్ ఊపిరి పీల్చుకున్నాడు. రైలును నెమ్మదిగా ముందుకు కదిలించాడు.
గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో వెరవాల్, ధరీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్పై నుంచి సింహాలు తప్పుకుంటున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు.
గుజరాత్లోని గిర్ అభయారణ్యం ఆసియా సింహాలకు ప్రసిద్ధి. ఈ అరణ్యంలో ప్రపంచంలోనే అత్యధిక సింహాలు ఉన్నాయి. అభయారణ్యం చుట్టుపక్కల గ్రామాలపై ఇవి తరచూ దాడులు చేస్తూ ఆవులను చంపేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి.
గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో వెరవాల్, ధరీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్పై నుంచి సింహాలు తప్పుకుంటున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు.
గుజరాత్లోని గిర్ అభయారణ్యం ఆసియా సింహాలకు ప్రసిద్ధి. ఈ అరణ్యంలో ప్రపంచంలోనే అత్యధిక సింహాలు ఉన్నాయి. అభయారణ్యం చుట్టుపక్కల గ్రామాలపై ఇవి తరచూ దాడులు చేస్తూ ఆవులను చంపేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి.