ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలైంది. కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారని లేఖరాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. చెన్నసంద్రకు చెందిన మేఘన దయానంద సాగర్ కాలేజీలో మొదటి ఏడాది సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. మంగళవారం కాలేజీకి వెళ్లిన మేఘన, తిరిగి ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకుంది. మేఘన తల్లిదండ్రులు ఉద్యోగులు కావడంతో వారు విధులు వెళ్లిన తర్వాత కాలేజీ నుంచి ఇంటికొచ్చి ఘాతాకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. నలుగురు సీనియర్లతోపాటు డిపార్ట్మెంట్ హెడ్ రాజ్కుమార్ కూడా తనను ర్యాగింగ్ చేయడంతోనే తీవ్రమనస్తాపం చెందిన తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని మేఘన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మంగళవారం తన నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకుని మేఘన ఆత్మహత్యకు పాల్పడింది.
మరోవైపు తమ కళాశాలలో ర్యాగింగ్కు అవకాశం లేదని ప్రిన్సిపల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అలాగే క్లాస్ రిప్రజెంటివ్ ఎన్నికల సమయంలో ఆమె పోటీ చేసి, ఓటమి భయంతో బలవన్మరణానికి పాల్పడినట్లు వస్తోన్న వార్తల్లోనూ నిజంలేదని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఆమె ఫైలయ్యిందని, హెచ్ఓడీ రాజ్కుమార్ తమ కళాశాలలో గత 31 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాలేజీ బయట మేఘన ఎవరితోనైనా గొడవ పడి ఉండొచ్చని, దీంతో ఆమెను వేధించి ఉంటారని ప్రిన్సిపాల్ అనుమానం వ్యక్తంచేశారు. మేఘన తండ్రి చంద్రశేఖర్ బ్యాంకులో మేనేజర్ కాగా, తల్లి లత ఒక సహకార సంఘంలో ఉద్యోగి. సీనియర్ల వేధింపులతోనే కాలేజీకి వెళ్లడానికి భయపడేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన రాజరాజేశ్వరినగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు తమ కళాశాలలో ర్యాగింగ్కు అవకాశం లేదని ప్రిన్సిపల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అలాగే క్లాస్ రిప్రజెంటివ్ ఎన్నికల సమయంలో ఆమె పోటీ చేసి, ఓటమి భయంతో బలవన్మరణానికి పాల్పడినట్లు వస్తోన్న వార్తల్లోనూ నిజంలేదని ఆయన వ్యాఖ్యానించారు. మొదటి సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఆమె ఫైలయ్యిందని, హెచ్ఓడీ రాజ్కుమార్ తమ కళాశాలలో గత 31 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాలేజీ బయట మేఘన ఎవరితోనైనా గొడవ పడి ఉండొచ్చని, దీంతో ఆమెను వేధించి ఉంటారని ప్రిన్సిపాల్ అనుమానం వ్యక్తంచేశారు. మేఘన తండ్రి చంద్రశేఖర్ బ్యాంకులో మేనేజర్ కాగా, తల్లి లత ఒక సహకార సంఘంలో ఉద్యోగి. సీనియర్ల వేధింపులతోనే కాలేజీకి వెళ్లడానికి భయపడేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన రాజరాజేశ్వరినగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.