యాప్నగరం

రెండాకులు గుర్తు... పళని- పన్నీర్ వర్గానికే!

త వారం శశికళ, ఆమె బంధువులు, స్నేహితుల నివాసాలపై పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే.

TNN 23 Nov 2017, 2:27 pm
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న శశికళకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత వారం శశికళ, ఆమె బంధువులు, స్నేహితుల నివాసాలపై పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ సోదాలు ఇంకా కొనసాగుతుండగా రెండాకుల గుర్తు రూపంలో ఆమెకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండాకులు తమదంటే తమదేనని పళని-పన్నీర్ వర్గం, శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం పోటీపడ్డాయి. అమ్మకు అసలైన వారసులం తామేనని, రెండాకుల గుర్తు తమకే కేటాయించాలని దినకరన్ వర్గం జాతీయ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలను పరిశీలించిన ఈసీ రెండాకుల గుర్తును ఓపీఎస్, ఈపీఎస్ వర్గానికి కేటాయించింది.
Samayam Telugu eps ops win aiadmk party symbol dhinakaran loses his case sources
రెండాకులు గుర్తు... పళని- పన్నీర్ వర్గానికే!


శశికళ వర్గం వాదనలను ఈసీ తోసిపుచ్చడంతో ఇంతవరకు జయలలితకు అసలైన వారసులం తామేనని ప్రచారం చేసుకుంటున్న వీరికి షాక్ తగిలింది. రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలతో దినకరన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి గత ఫిబ్రవరిలో ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా చీలిపోయింది. శశికళ వర్గంలో ఉన్న పళని సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

అర్కేనగర్ ఉపఎన్నికల్లో తనకు రెండు ఆకుల గుర్తు కేటాయించాలని దినకరన్ కోరుతూ చంద్రశేఖర్ అనే మధ్యవర్తికి రూ.1.39 కోట్లు ఇచ్చాడు. మధ్యవర్తి చంద్రశేఖర్ ఢిల్లీలో క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా దినకర్ పై పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓటర్లకు భారీ ఎత్తున డబ్బు పంచారనే ఆరోపణలు రావడంతో ఆర్కే నగర్ ఉపఎన్నికను ఈసీ వాయిదా వేసింది. అయితే డిసెంబరు 31లోగా ఎన్నిక నిర్వహించాలని మద్రాసు హైకోర్టు రెండు రోజుల కిందట తీర్పు వెలువరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.