యాప్నగరం

ప్రతి హిందువూ నలుగురు పిల్లల్ని కనాలి: గిరిరాజ్‌ మహరాజ్‌

ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలని హరిద్వార్‌ పీఠాధిపతి స్వామీ గోవింద్‌ దేవ్‌ గిరిరాజ్‌ మహరాజ్‌ పిలుపునిచ్చారు. కర్ణాటకలోని ఉడిపిలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ధర్మ సంసద్‌’ కార్యక్రమంలో శనివారం (నవంబర్ 25) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

TNN 25 Nov 2017, 10:30 pm
ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలని హరిద్వార్‌ పీఠాధిపతి స్వామీ గోవింద్‌ దేవ్‌ గిరిరాజ్‌ మహరాజ్‌ పిలుపునిచ్చారు. కర్ణాటకలోని ఉడిపిలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ధర్మ సంసద్‌’ కార్యక్రమంలో శనివారం (నవంబర్ 25) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల దేశంలో హిందువుల జనాభా తగ్గుముఖం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో.. ఆ ప్రాంతాన్ని భారత్‌ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతౌల్యమే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు.
Samayam Telugu every hindu must produce 4 kids says swami govind dev giriraj maharaj
ప్రతి హిందువూ నలుగురు పిల్లల్ని కనాలి: గిరిరాజ్‌ మహరాజ్‌


‘దేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చేంత వరకు.. ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలి. ఇలా చేయడం వల్లే జనాభాను సమతౌల్యంగా ఉంచడం సాధ్యమవుతుంది. లేకపోతే ప్రభుత్వం ఇద్దరు పిల్లల విధానాన్ని అందరికీ వర్తింపజేయాలి’ అని గిరిరాజ్‌ మహరాజ్‌ అన్నారు.

ఆవులను రక్షించుకోవడం హిందువుల బాధ్యత అని గోవింద్‌దేవ్‌ గిరిరాజ్‌ అన్నారు. గోవుల రక్షణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ‘గో రక్షక్‌’లపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘ప్రస్తుతం గో రక్షక్‌లను కొంతమంది నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారు.. గో రక్షక్‌లు అత్యంత శాంతి ప్రియులు’ అని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.