మేం గెలిచాం.. ఈవీఎంల టాంపరింగ్ లేదు!
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం
TNN 13 Apr 2017, 6:46 pm
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ రెండు స్థానాలు కైవసం చేసుకోవడం గమనార్హం. అంతేకాదు.. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల పోలింగ్ లో ఈవీఎంలు టాంపరింగ్ అయ్యాయని... ఏపార్టీకి ఓటేసినా బీజేపీకే పడుతున్నాయని కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. కర్ణాటక సీఎం సిద్దరామయ్య (కాంగ్రెస్) మాత్రం.. ఈవీఎంలు టాంపరింగ్ జరగలేదని వ్యాఖ్యానించారు.
గుండ్లుపేట్, నంజగుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవవమూర్తి, మహాదేవ్ ప్రసాద్ లు బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించారు.
గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
‘ఈవీఎంలు టాంపరింగ్ కు గురి కాలేదు. టాంపరింగ్ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటకలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో మాత్రం ఏలాంటి టాంపరింగ్ జరగలేదు’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం అమరింద్ సింగ్ (కాంగ్రెస్) కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ రాష్ట్రంలో ఈవీఎంల టాంపరింగ్ జరగలేదని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో జరిగిన పది అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఇందులో బీజేపీ ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. కర్ణాటక మూడు (కర్ణాటక (2), మధ్యప్రదేశ్ (1)స్థానాలు గెలుచుకోగా, పశ్చిమ బంగలో తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ లో జెఎంఎంలు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి.
గుండ్లుపేట్, నంజగుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవవమూర్తి, మహాదేవ్ ప్రసాద్ లు బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించారు.
గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
‘ఈవీఎంలు టాంపరింగ్ కు గురి కాలేదు. టాంపరింగ్ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటకలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో మాత్రం ఏలాంటి టాంపరింగ్ జరగలేదు’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం అమరింద్ సింగ్ (కాంగ్రెస్) కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ రాష్ట్రంలో ఈవీఎంల టాంపరింగ్ జరగలేదని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో జరిగిన పది అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఇందులో బీజేపీ ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. కర్ణాటక మూడు (కర్ణాటక (2), మధ్యప్రదేశ్ (1)స్థానాలు గెలుచుకోగా, పశ్చిమ బంగలో తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ లో జెఎంఎంలు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి.