యాప్నగరం

అలసిపోయా, వెళ్లిపోతున్నా.. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

CBI: సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్మాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. సూసైడ్ లేఖను రాసిపెట్టారు.

Samayam Telugu 7 Oct 2020, 10:25 pm
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన నివాసంలో బుధవారం (అక్టోబర్ 7) సాయంత్రం ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. అశ్వనీ కుమార్ ఆత్మహత్య వార్త పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Samayam Telugu మాజీ సీబీఐ డైరెక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్య
Ashwani Kumar


ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అశ్వనీ కుమార్ సూసైడ్ లేఖను రాసి ఉంచారు. ‘జీవిత ప్రయాణంలో అలసిపోయాను.. తదుపరి ప్రయాణం కోసం వెళ్లిపోతున్నాను’ అని ఆయన లేఖలో రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అశ్వనీ కుమార్ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, ఐజీఎంసీ వైద్యులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన మరణాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ధ్రువీకరించారు. అశ్వనీ కుమార్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఎంతో మంది అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు ఆయన రోల్ మోడల్‌గా ఉండేవారని అన్నారు. అశ్వనీ కుమార్ సీబీఐ డైరెక్టర్ పదవితో పాటు నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలకు గవర్నర్‌గానూ పనిచేశారు.

Must Read: కోతుల కొట్లాట.. ఇద్దరి మృతి

Also Read: ఖమ్మం: బాలిక ఒంటికి నిప్పు.. అందుకు నిరాకరించడంతో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.