యాప్నగరం

కర్నాటకీయం: హైదరాబాద్ చేరుకున్న సిద్ధరామయ్య

కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య హైదరాబాద్ చేరుకున్నారు.

Samayam Telugu 18 May 2018, 5:19 pm
కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌ కృష్ణాలో కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అంతకుముందు బెంగళూరు ఎయిర్‌పోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య బయలుదేరాల్సిన ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌కు ఏజీసీఏ నుంచి చాలాసేపటి వరకు అనుమతి రాలేదు. దీంతో ఆయన అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా హైదరాబాద్ చేరుకున్నారు.
Samayam Telugu siddha


కన్నడ నాట తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 76 మంది శుక్రవారం (మే 18) ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో ఉన్నారు.

కర్ణాటక శాసనసభలో శనివారం సాయత్రం 4 గంటలకు బల పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.