2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్థాన్ లోనే జరిగిందని ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహ్మాద్ అలీ దురానీ ధృవీకరించారు.
దురానీ సోమవారం ఢిల్లీలో జరిగిన 19వ ఏషియా భద్రతా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘26/11 దాడులకు పాకిస్థాన్ లో వ్యూహ రచన జరిగింది’’ అని స్పష్టం చేశారు.
అయితే ఈ దాడులతో గానీ..దాడులకు పూనుకున్నవారితో గానీ పాకిస్థాన్ ప్రభుత్వం, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)లతో ఏలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఉగ్రవాదం భారత్-పాకిస్థాన్ ల మధ్య దూరం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని సూచించారు.
సముద్ర మార్గం గుండా పాకిస్థాన్ కు చెందిన పదిమంది తీవ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబైకి చేరుకున్నారు. ఛత్రపతి టెర్మినల్, తాజ్ హోటల్, ఒబేరాయ్ ట్రైడెంట్, లిపోల్డ్ కేఫ్, యూదుల సెంటర్ అయిన నారిమన్ హౌజ్ లపై దాడులు చేశారు. అందులో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకున్న ఉగ్రతాండవం చేశారు. ఉగ్రమూకలు జరిగిన కాల్పుల్లో 166మంది చనిపోగా..300మంది దాకా గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో 9మంది చనిపోగా..అజ్మల్ కసబ్ ప్రాణాలతో భద్రతా దళాలకు చిక్కాడు. కసబ్ ను 2012 నవంబర్ లో ఉరి తీశారు.
పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు భారత్ పై దాడికి పాల్పడ్డ సమయంలో ఆ దేశానికి జాతీయ భద్రతా సలహాదారుగా మహ్మాద్ అలీ దురానీ కొనసాగారు. 2009 లో పాక్ ప్రభుత్వం ఆ పదవిలో నుంచి ఆయన్ను తొలగించింది.
26/11 దాడులకు పాకిస్థాన్ దే బాధ్యతంటూ...ఈ దాడుల వెంటనే లష్కరే తొయిబా వంటి హస్తముందని..భారత్ ఎన్ని ఆధారాలు సమర్పించిన అక్కడి ప్రభుత్వం...ఖండిస్తూ వచ్చింది.
ఈ దాడులను అమలు చేసిన అమెరికన్ సిటీజన్ డేవిడ్ హెడ్లీ సైతం పాకిస్థాన్ ప్రమేయాన్ని ధృవీకరించాడు.
దురానీ సోమవారం ఢిల్లీలో జరిగిన 19వ ఏషియా భద్రతా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘26/11 దాడులకు పాకిస్థాన్ లో వ్యూహ రచన జరిగింది’’ అని స్పష్టం చేశారు.
అయితే ఈ దాడులతో గానీ..దాడులకు పూనుకున్నవారితో గానీ పాకిస్థాన్ ప్రభుత్వం, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)లతో ఏలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఉగ్రవాదం భారత్-పాకిస్థాన్ ల మధ్య దూరం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని సూచించారు.
సముద్ర మార్గం గుండా పాకిస్థాన్ కు చెందిన పదిమంది తీవ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబైకి చేరుకున్నారు. ఛత్రపతి టెర్మినల్, తాజ్ హోటల్, ఒబేరాయ్ ట్రైడెంట్, లిపోల్డ్ కేఫ్, యూదుల సెంటర్ అయిన నారిమన్ హౌజ్ లపై దాడులు చేశారు. అందులో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకున్న ఉగ్రతాండవం చేశారు. ఉగ్రమూకలు జరిగిన కాల్పుల్లో 166మంది చనిపోగా..300మంది దాకా గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో 9మంది చనిపోగా..అజ్మల్ కసబ్ ప్రాణాలతో భద్రతా దళాలకు చిక్కాడు. కసబ్ ను 2012 నవంబర్ లో ఉరి తీశారు.
పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు భారత్ పై దాడికి పాల్పడ్డ సమయంలో ఆ దేశానికి జాతీయ భద్రతా సలహాదారుగా మహ్మాద్ అలీ దురానీ కొనసాగారు. 2009 లో పాక్ ప్రభుత్వం ఆ పదవిలో నుంచి ఆయన్ను తొలగించింది.
26/11 దాడులకు పాకిస్థాన్ దే బాధ్యతంటూ...ఈ దాడుల వెంటనే లష్కరే తొయిబా వంటి హస్తముందని..భారత్ ఎన్ని ఆధారాలు సమర్పించిన అక్కడి ప్రభుత్వం...ఖండిస్తూ వచ్చింది.
ఈ దాడులను అమలు చేసిన అమెరికన్ సిటీజన్ డేవిడ్ హెడ్లీ సైతం పాకిస్థాన్ ప్రమేయాన్ని ధృవీకరించాడు.