యాప్నగరం

నోట్ల మార్పిడి పరిమితి 2వేలకు కుదింపు

రద్దయిన పెద్ద నోట్లు రూ.500, రూ.1000ల మార్పిడికి డిసెంబర్ 30 వరకు గడువు విధించిన కేంద్ర ప్రభుత్వం...

TNN 17 Nov 2016, 11:40 am
రద్దయిన పెద్ద నోట్లు రూ.500, రూ.1000ల మార్పిడికి డిసెంబర్ 30 వరకు గడువు విధించిన కేంద్ర ప్రభుత్వం...రోజుకో షరతు విధిస్తూ సామాన్యులను భయందోళనలకు గురిచేస్తోంది. ఒకవైపు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకునేవాళ్లు మళ్లీ తిరిగి రాకుండా కస్టమర్ల చూపుడు వేలిపై చెదిరిపోని సిరా గుర్తు వేస్తుండగా..రేపటి (శుక్రవారం) నుంచి పాతనోట్ల మార్పిడి పరిమితి కేవలం రూ.2000లకే కుదించింది.
Samayam Telugu exchange of notes limit reduced to rs 2000
నోట్ల మార్పిడి పరిమితి 2వేలకు కుదింపు


ఇది గురువారం వరకు రూ.4500లుగా ఉంది.

నిత్యవసర వస్తువులు, కూరగాయాలు అమ్ముకునే చిరువ్యాపారులు వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. విత్ డ్రా సమయంలో సంబంధిత వ్యాపార రిజిస్ట్రేషన్ గుర్తింపు పత్రాలు చూపించాలని సూచించింది.

రైతులు వారానికి రూ.25వేలు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. పంట బీమా ప్రీమియం చెల్లింపునకు 15రోజులు గడువు పెంచింది.

కేంద్రప్రభుత్వ మూడోతరగతి ఉద్యోగులు అడ్వాన్సుల కింద రూ.10వేలు పొందవచ్చని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శశికాంత దాస్ వెల్లడించారు.

వివాహా ఖర్చుల కోసం సంబంధిత కుటుంబ సభ్యులు ఒకే ఖాతా నుంచి వారానికి రూ.2.50లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.