యాప్నగరం

టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 8 మంది మరణించారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు కంపించాయి.

Samayam Telugu 26 Oct 2018, 7:09 pm
పాసుల ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న భారీ పేలుడులో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా రసూర్‌పూర్‌లో శుక్రవారం (అక్టోబర్ 26) సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి బాణాసంచా నిల్వ చేసిన భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
Samayam Telugu explosion


భారీ పేలుడు ధాటికి పరిసర ప్రాంతం కంపించింది. స్థానికులు భయాందోళనలతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. టపాసులు నిల్వ చేసిన గోదాంకు లైసెన్స్ ఉందని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని బదౌన్ ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శిథిలాలను తొలగించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.