యాప్నగరం

పేలుళ్లతో కుప్పకూలిన భవనం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. టపాసుల పేలుళ్లతో రెండంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మరణించారు.

Samayam Telugu 23 Feb 2019, 5:55 pm
త్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. భదోహి జిల్లాలోని చౌరీ ప్రాంతంలో ఓ రెండంతస్తుల భవనంలో పేలుడు సంభవించి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భవనంలోని 10 మంది దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. భవనంలో అక్రమంగా టపాసులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని బాణసంచా పేలడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu up


సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటనా స్థలికి చేరుకొని పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఆ భవంతిలో భారీగా బాణసంచా నిల్వ ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.