యాప్నగరం

నకిలీ స్టాంప్ పేపర్ల నేరగాడు కరీం తెల్గీ మృతి

స్టాంప్ పేపర్ల కుంభకోణం నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ మృతి చెందాడు. ఆరోగ్యం విషమించడంతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెల్గీ గురువారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం మరణించాడని వైద్యులు తెలిపారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్ తదితర వ్యాధులతో అతడు బాధపడుతున్నాడు.

TNN 26 Oct 2017, 5:38 pm
నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ మృతి చెందాడు. ఆరోగ్యం విషమించడంతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెల్గీ గురువారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం మరణించాడని వైద్యులు తెలిపారు. 16 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెల్గీ.. డయాబెటిస్, హైపర్ టెన్షన్ తదితర వ్యాధులతో బాధపడుతున్నాడు. 2001లో హెచ్‌ఐవీ సోకిందని అప్పట్లో వైద్యులు ధ్రువీకరించారు. తాజాగా మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే కండరాలు, రక్తనాళాలు బలహీనపడటంతో అతడు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో 2 రోజులుగా అతణ్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
Samayam Telugu fake stamp paper scam kingpin karim telgi dies in bengaluru
నకిలీ స్టాంప్ పేపర్ల నేరగాడు కరీం తెల్గీ మృతి


స్టాంప్ పేపర్ల కుంభకోణంలో తెల్గీ ప్రధాన సూత్రధారి. బెంగళూరు కేంద్రంగా 9 రాష్ట్రాల్లోని 72 కేంద్రాల నుంచి నకిలీ స్టాంపులు విక్రయించాడని విచారణలో తేలింది. పోలీసు అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు, పాత్రికేయుల అండదండలతో తెల్గీ తన అక్రమాలను సాగించాడు.

తెల్గీని 2001 నవంబర్‌లో అజ్మీర్‌లో అరెస్టు చేశారు. కేసులన్నింటిలో అతడిపై నేరం రుజువు కావడంతో.. కోర్టు 40 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. నాటి నుంచి తెల్గీని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంచారు. తెల్గీపై కోర్టు రూ. 202 కోట్ల జరిమానా విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.